అర్హులైన వారికి వెంటనే పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వలనని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నా

కడప జిల్లా. కొండాపురం లోకల్ టైమ్స్: కడప జిల్లా: కొండాపురం మండలం లో తెలుగుదేశం బిజెపి సిపిఐ నాయకులు ధర్నా చేశారు మండలంలో వితంతు వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు సుమారుగా వెయ్యి వరకు తొలగించారు. రేషన్ కార్డులు తొలగించారు ఇలా తొలగించడం చాలా దారుణం అని. నూతన శకం ఆవిర్భవిస్తుందని చెప్పి అసలుకే మోసం చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికారులు ఇప్పటికైనా అర్హులైన వారిని గుర్తించి ఈ నెలలోనే అందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని లేకుంటే నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి ఏం మనోహర్ బాబు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సి, రామిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి జె, ప్రవీణ్ యాదవ్ మండల యూత్ ఏ, గిరీష్. ఏ ఐ టి యు సి వెంకటసుబ్బయ్య బిజెపి మండల కన్వీనర్ సి చంద్రశేఖర్ రెడ్డి టిడిపి గోవర్ధన్ రెడ్డి భవన నిర్మాణం వి వెంకటరమణ భాస్కర్ సుబ్బరావు విక్కీ సుధీరు మారుతి ఖాదర్ భాష హాజీ వల్లి టిప్పర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

