ఆరోగ్యా తెలంగాణ” దిశగా ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడానికి సిఎం కే.సి.ఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది.


మేడ్చల్ జిల్లా లోకల్ టైమ్స్ రిపోర్టర్ వెంకటాచారి
ఆరోగ్యా తెలంగాణ” దిశగా ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడానికి సిఎం కే.సి.ఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా సి.యం కే.సి.ఆర్ గారి జన్మదిన సందర్బంగా ఒక ప్రయత్నం.
ఈరోజు మేడ్చల్ మండలం లో 5000 మంది విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం జరిగింది.
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది మరియు మేడ్చల్ నియోజకవర్గం నుండి ప్రజారోగ్య పరివర్తనకు నాయకత్వం వహించడం చాలా సంతోషంగా ఉంది.
డిజిటల్ హెల్త్ కార్డు ను విద్యార్థులకు అందజేయడం జరిగింది.
తక్కువ సమయం లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయవొచ్చు.
ఈ డివైజెస్ ద్వారా విద్యార్ధి మెడికల్ రికార్డు ఆటోమేటిక్ గా నిక్షిప్తం అవుతుంది.
డిజిటల్ పరివర్తనలో భాగంగా, విద్యార్థులందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ కలిగి ఉన్న పాఠశాలగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మెడ్చల్, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్ నిలుస్తుంది.
లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ,యాప్ ద్వారా సమాచారం సేకరించవచ్చు.
విద్యార్థులకు చేయూతనిచ్చి విద్యార్థులకు ఏదైనా అపాయం ఉంటే ఆదుకోవోచ్చు
ఈ కార్యక్రమం వైద్య పరికరాలు, సాఫ్ట్వేర్ అనువర్తనాలు మరియు ఆరోగ్య వ్యవస్థల యొక్క అనుసంధాన మౌలిక సదుపాయాలను యాప్ ద్వారా సమిష్టి ఆరోగ్య సంరక్షణ సమాచారాన్ని అందిస్తుంది.
ఈ విధానం క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది, తప్పు నిర్ధారణను తగ్గిస్తుంది,
రోగి, సేవల నాణ్యతను మెరుగుపరిచి ,ఆసుపత్రిలో చేరిన రోగులను పర్యవేక్షించి మరియు కొన్ని సందర్భాల్లో వ్యాధులు రాకుండా కూడా నిరోధించవచ్చు
ఈ కార్యక్రమం కింద 49 ప్రభుత్వ పాఠశాలల్లో 4832 మంది విద్యార్థులు పరీక్షించగా, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ కలిగిన దేశంలోనే మొదటి మండలం గా మేడ్చల్ నిలుస్తుంది.
ఇంత మంచి ప్రయత్నం చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డికి మరియు వారి బృందానికి శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ ,కలెక్టర్ బి వెంకటేశ్వరులు , మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి , డిఇఓ శ్రీమతి విజయ కుమారి,డిఎంహెచ్ఓ నారాయణరావు ,ఎంపిపి పద్మ జగన్ రెడ్డి, జెడ్పిటిసి శైలజ విజయేందర్ రెడ్డి , మున్సిపల్ చైర్పర్సన్ దీపిక నరసింహరెడ్డి ,వైస్ చైర్మన్ రమేష్ ,మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ ,ఎంపిడిఓ పద్మావతి ,మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నార


